
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో వరుసగా రెండో మ్యాచ్ అభిమానులను ఆఖరి వరకు మునివేళ్లపై నిలబెట్టింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్లో ఫలితం తేలింది. ఈ ఉత్కంఠపోరులో ఢిల్లీ విజయం సాధించింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది.
మిచిల్ స్టార్క్ బౌలింగ్ చేసిన సూపర్ ఓవర్లో హెట్మైర్(5), రియాన్ పరాగ్(4) రాణించారు. అనంతరం 12 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం మూడు బంతుల్లోనే చేధించి విజయాన్ని అందుకుంది. రాజస్తాన్ తరపున సూపర్ ఓవర్ వేసిన సందీప్ శర్మ బౌలింగ్లోకేఎల్ రాహుల్ 7 పరుగులు చేయగా.. స్టబ్స్ సిక్సర్ కొట్టి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఈ మ్యాచ్లో ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్(49) టాప్ స్కోరర్గా నిలవగా.. రాహుల్(38), స్టబ్స్(34), అక్షర్ పటేల్(34) రాణించారు.
అనంతరం లక్ష్య చేధనలో రాజస్తాన్ కూడా 4 వికెట్లు కోల్పోయి సరిగ్గా 188 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో రాజస్తాన్ విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా.. మిచిల్ స్టార్క్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవలం 8 పరుగులిచ్చాడు. దీంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో మ్యాచ్ ఫలితాన్ని తేల్చడానికి అంపైర్లు సూపర్ ఓవర్ను నిర్వహించనున్నారు. ఈ సూపర్ ఓవర్లో ఢిల్లీనే పై చేయి సాధించింది.