
కొన్నేళ్లుగా ఆర్చరీ ప్రపంచకప్ టోర్నీలలో నిలకడగా పతకాలు సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ మరో కొత్త సీజన్కు సిద్ధమైంది. అంటాల్యాలో నేటి నుంచి వరల్డ్కప్ స్టేజ్–1 టోర్నీ జరగనుంది.
జ్యోతి సురేఖతోపాటు అవ్నీత్ కౌర్, అదితి స్వామి, సాక్షి చౌదరీ మహిళల కాంపౌండ్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో బరిలోకి దిగుతారు. 52 దేశాల నుంచి 394 మంది ఆర్చర్లు రికర్వ్, కాంపౌండ్ ఈవెంట్స్లో ఈ టోర్నీలో ఆడనున్నారు.