అక్కన్నపేట(హుస్నాబాద్): గిరిజనులు ప్రతియేటా నిర్వహించుకునే శీత్లాభవాని పండుగను మండలంలోని కెప్టన్చౌడుతండా గ్రామంలో మంగళవారం సర్పంచ్ గుగులోతు స్వరూపరాజు నేతృత్యంలో గిరిజనులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రజలు పశుపక్ష్యాధులు ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు కురవాలని గిరిజన మహిళలు, యువతులు శీత్లా భవానీకి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మహిళ లు తమ సంప్రదాయ దుస్తులు ధరించి డప్పుచప్పుళ్ల నడుమ నృత్యాలు చేసుకుంటూ తరలివెళ్లా రు. గ్రామస్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


