పకడ్బందీగా అమలు చేయాల్సిన ఈ పథకాన్ని ప్రభుత్వం నామమాత్రంగా అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. జిల్లాలో 1.18లక్షల ఎకరాల సాగు అంచనాకు ఇప్పటికే 70 వేల పైచిలుకు ఎకరాల్లో పత్తి సాగులోకి వచ్చేసింది. జూలై 15లోగా పత్తి విత్తన గడువు కూడా ముగియనున్నది. ఈ దశలో మూడు రోజులుగా ఉచిత పత్తి విత్తనాల పంపిణీ ప్రక్రియ కొన్ని చోట్ల మాత్రమే ప్రారంభమైంది. జిల్లాకు కేవలం 7వేల ఎకరాలలోపు అవసరమయ్యే విత్తనాలు మాత్రమే వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఇవీ కూడా హడావిడిగా రైతు వేదికల వద్ద అందుబాటులో ఉన్న రైతులను పిలిచి పంపిణీ చేస్తూ...‘మమ’అనిపిస్తున్నారు.


