న్యూస్రీల్
కోలాటం బృందానికి నంది అవార్డులు
మిరుదొడ్డి(దుబ్బాక): మండల కేంద్రానికి చెందిన కోలాటం కళా బృందానికి జాతీయ స్థాయి స్వర్ణ నంది అవార్డులు వరించాయి. ఈ మేరకు సోమవారం కోలాటం బృందం సభ్యులు మాట్లాడుతూ సామాజిక సేవ, సాంస్కృతిక విభాగాల్లో విశిష్ట సేవలను అందించినందుకు అవార్డులు వచ్చాయన్నారు. వేద రూరల్ పీపుల్స్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొమురవెల్లిలో ఆదివారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కళా ఉత్సవాల్లో 20 స్వర్ణ నంది అవార్డులను అందుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ నందిని, కోలాటం బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారన్నారు.


