పోటెత్తిన భక్తజనం | - | Sakshi
Sakshi News home page

పోటెత్తిన భక్తజనం

Mar 17 2025 9:35 AM | Updated on Mar 17 2025 9:35 AM

పోటెత్తిన భక్తజనం

పోటెత్తిన భక్తజనం

కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తొమ్మిదవ ఆదివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. వచ్చేవారం బ్రహ్మోత్సవాలు ముగియనుండటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. గంగిరేణు చెట్టు వద్ద పట్నాలు వేసి, ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.

– కొమురవెల్లి(సిద్దిపేట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement