అటవీ ప్రాంతంలో తవ్వకాల కలకలం | - | Sakshi
Sakshi News home page

అటవీ ప్రాంతంలో తవ్వకాల కలకలం

Sep 6 2026 8:31 AM | Updated on Sep 6 2026 8:31 AM

గజ్వేల్‌రూరల్‌: మండల పరిధిలోని రంగంపేట అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయం తెలుసుకున్న రంగంపేట సర్పంచ్‌ నాగరాజు గ్రామస్తులతో కలిసి గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో తవ్వకాలు జరిపిన బొమ్మనగుండ్ల ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతంలో నాలుగైదు చోట్ల తవ్వకాలు జరిపినట్లు ఆనవాళ్లను గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతం సమీపంలోని పంట పొలాల వద్దకు రైతులు, మహిళలు పనుల కోసం వస్తుంటారని, తవ్వకాలు జరపడంతో భయాందోళనలకు గురవుతున్నట్లు తెలిపారు. తవ్వకాలు జరిగిన చోట పగిలిపోయిన కుండ పెచ్చులను గుర్తించామని, ఈ తవ్వకాలు గుప్త నిధుల కోసమా.. లేదా ఇంకేమైనా ఉందా అనే కోణంలో సంబంధిత శాఖల అధికారులు విచారణ జరిపి, తవ్వకాలకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement