దుబ్బాక: వినూత్న పద్ధతులతో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ ప్రశంసలు అందుకుంటోంది గంభీర్పూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఉప్పునూతల మాధవి. నా చిన్న ప్రపంచం అనే శీర్షికతో కథారూపంలో ఉన్న పాఠ్యాంశాలను స్వయంగా రూపొందించుకున్న తోలుబొమ్మల ద్వారా ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ(ఎస్ఈఆర్టీ)వారి మ్యాగజైన్లో హర్బెంజర్స్ ఆఫ్ చేంజ్ అనే శీర్షికన మాధవి సక్సెస్ స్టోరీ ప్రచురింపబడింది. జిల్లా స్థాయిలో ఉత్తమ బోధన ప్రదర్శన కింద ఎంపికై .. హైదరాబాద్లో 600 మంది విద్యాధికారుల సమక్షంలో ప్రదర్శించారు. మొదటి బహుమతితో పటు ప్రశంసలు అందుకున్నారు. పలు అవార్డులతో పాటు ఇటీవల రాష్ట్రస్థాయి పప్పెటరీ పోటీల్లో కన్సోలేషన్ బహుమతిని అందుకుంది.


