నర్సాపూర్ రూరల్: కుక్కలు వరాహాన్ని వెంటబడి తరమడం, మొరగడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ నర్సాపూర్ పట్టణంలోని 15వ వార్డులో కనిపించిన ఓ దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడ ఓ వరాహం తన పిల్లలతో పాటు కుక్క పిల్లలకు పాలు ఇస్తూ తల్లి ప్రేమను పంచుతోంది. తల్లిని కోల్పోయిన ఆ కుక్క పిల్లలు ఆకలితో అలమటిస్తుండగా, ఆ వరాహం వాటికి పాలు ఇవ్వడం చూసి స్థానికులు ముగ్ధులవుతున్నారు. జాతి భేదం లేకుండా అమ్మ ప్రేమ గొప్పదని ఈ దృశ్యం నిరూపించిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
కుక్కపిల్లకు పాలిచ్చిన వరాహం


