సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలి

Mar 9 2026 9:26 AM | Updated on Mar 9 2026 9:26 AM

ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌

ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌

సంగారెడ్డి: మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ పేర్కొన్నారు. పట్టణంలోని రాజంపేట్‌ శివాలయంలో బ్రాహ్మణ సహకార సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతా ప్రభాకర్‌ హాజరై మహిళలనుద్దేశించి ప్రసంగించారు. మహిళలు కుటుంబాన్ని తీర్చిదిద్దడంతోపాటు సమాజాభివృద్ధిలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నారన్నారు. మహిళలు విద్య, వైద్యం, వ్యాపారం, రాజకీయాలు వంటి అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్యేను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నరహరిరెడ్డి, కంది మండల బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, కౌన్సిలర్‌ జలంధర్‌ రావు, బ్రాహ్మణ సహకార సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement