ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్టు
● బంగారు గొలుసు స్వాధీనం ● నిందితులు రిమాండ్కు తరలింపు
జహీరాబాద్ టౌన్: పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శుక్రవారం పోలీస్స్టేషన్లో డీఎస్పీ సైదా నాయక్ చోరీ వివరాలను వెల్లడించారు. పటాన్చెరువుకు చెందిన ఎండీ నిజాం, ఆయాజ్లు ఈ నెల 22న పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. కాలనీలో నివాసం ఉంటున్న సౌజన్య కంప్యూటర్ తరగతులు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. ఈ సమయంలో వెనక నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు. బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. సీసీ కెమెరాలను తనిఖీలు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారి నుంచి రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడు, మోటారు బైక్, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న సీఐ శివలింగం, ఎస్ఐ వినయ్కుమార్, సిబ్బందిని అభినందించారు.


