మర్వెళ్లిలో తుపాకీ కలకలం | - | Sakshi
Sakshi News home page

మర్వెళ్లిలో తుపాకీ కలకలం

Jan 31 2026 9:32 AM | Updated on Jan 31 2026 9:32 AM

మర్వెళ్లిలో తుపాకీ కలకలం

మర్వెళ్లిలో తుపాకీ కలకలం

● మామ ఇంట్లో అల్లుడి దొంగతనంతో విషయం బయటకు.. ● భయంతో 100కు ఫోన్‌చేసిన అల్లుడు

● మామ ఇంట్లో అల్లుడి దొంగతనంతో విషయం బయటకు.. ● భయంతో 100కు ఫోన్‌చేసిన అల్లుడు

వట్‌పల్లి(అందోల్‌): మండలంలోని మర్వెళ్లిలో తుపాకీ ఘటన శుక్రవారం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్దగొల్ల విఠల్‌ చిన్న కూతురు అదే గ్రామానికి చెందిన సాయిగారి కిషోర్‌ను వివాహం చేసుకుంది. అయితే అల్లుడు కొంతకాలంగా మామ కుటుంబంతో దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అల్లుడు బుధవారం సాయంత్రం మామ ఇంటికి దొంగతనానికి వెళ్లి ఇంట్లో ఉన్న ఓ పెట్టెను ఎత్తుకెళ్లి చూడగా.. అందులో తుపాకీ కనిపించింది. తనను చంపడానికే అని భయపడి కిషోర్‌ 100కు ఫోన్‌చేసి సమాచారం అందించాడు. ఈ విషయం తెలుసుకున్న వట్‌పల్లి పోలీసులు శుక్రవారం మర్వెళ్లికి చేరుకొని విచారణ చేపట్టారు. కిషోర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లవకుమార్‌ తెలిపాడు. అయితే తుపాకీ లభించడంపై గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement