పకడ్బందీగా కోడ్‌ అమలు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా కోడ్‌ అమలు

Jan 29 2026 8:36 AM | Updated on Jan 29 2026 8:36 AM

పకడ్బందీగా కోడ్‌ అమలు

పకడ్బందీగా కోడ్‌ అమలు

సంగారెడ్డి జోన్‌: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాలతోపాటు నామినేషన్‌ కేంద్రాలను పోలీసు అధికారులు సందర్శించాలని ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ ఆదేశించారు. ఎస్పీ కార్యాలయం నుంచి టెలికాన్ఫరెన్స్‌ ద్వారా ఎస్‌హెచ్‌ఓలకు పలు సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఆయా కేంద్రాలను సందర్శించి సమస్యాత్మకంగా ఉన్న వాటిని గుర్తించాలన్నారు.

నామినేషన్‌ కేంద్రాల వద్ద

పాటించవలసిన సూచనలివీ..

● నామినేషన్‌ కేంద్రం నుంచి 100 మీటర్ల పరిధిలో 163 బీఎన్‌ఎస్‌ ఎస్‌ (144 సీఆర్‌పీసీ) అమలులో ఉంటుంది. కావున ప్రజలు గుంపులుగా ఉండకూడదు.

● కేంద్రానికి అభ్యర్థితోపాటు ఒకరు లేదా ఇద్దరు ప్రతిపాదకులను మాత్రమే అనుమతిస్తారు.

● శాంతి భద్రతలు పాటించాలి. నినాదాలు, ప్రచారం పూర్తిగా నిషేధం.

● పరిసరాల్లో నినాదాలు, లౌడ్‌ స్పీకర్లు, బ్యాండ్లు వాడకూడదు. అదేవిధంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేయకూడదు.

● ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాలను దూరంగా పార్క్‌ చేయాలి.

● నామినేషన్‌ కేంద్రం పరిసరాల్లో మద్యం తాగడం, పంపిణీ చేయడం నిషేధం.

● ఇతర అభ్యర్థులను బెదిరించడం, అడ్డుకోవడం వంటి అనైతిక చర్యలకు పాల్పడకూడదు.

● సంబంధిత అధికారుల అనుమతి లేనిదే ర్యాలీలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించకూడదు.

● నామినేషన్‌ ప్రక్రియకు అంతరాయం కలిగించే విధంగా సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేయకూడదు.

ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement