నాడు తండ్రి.. నేడు తల్లి మృతి
● అనాథలైన చిన్నారులు
● ఆదుకోవాలని గ్రామస్తుల వేడుకోలు
అక్కన్నపేట(హుస్నాబాద్): మూడేళ్ల క్రితం తండ్రి మృతి చెందగా... సోమవారం గుండెపోటుతో తల్లి మృతి చెందింది. దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. ఈ సంఘటన మండలంలోని కేశవాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన జెట్టి లావణ్య గుండెపోటుతో మృతి చెందారు. మూడేళ్ల క్రితం జెట్టి భాస్కర్ ట్రాక్టర్తో పొలం దున్నుతున్న క్రమంలో అది తలకిందులై మృతి చెందాడు. ఈ దంపతులకు జెట్టి సాహిత్య(08), శ్రీనిధి(10) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ చిన్నారులిద్దరూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. అనాథలైన చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ మమత, వార్డు సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.
నాడు తండ్రి.. నేడు తల్లి మృతి


