కార్యకర్తలకు అండగా ఉంటా | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలకు అండగా ఉంటా

Apr 10 2025 7:15 AM | Updated on Apr 10 2025 7:15 AM

కార్యకర్తలకు అండగా ఉంటా

కార్యకర్తలకు అండగా ఉంటా

పటాన్‌చెరు: బీఆర్‌ఎస్‌ కోసం కష్టించి పనిచేసే ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటానని ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పటాన్‌చెరు మండలం గణేశ్‌గడ్డలో బుధవారం నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశానికి హరీశ్‌రావు హాజరై కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటుండటంతో ఆపార్టీ కార్యకర్తలు డీలా పడిన పరిస్థితుల నేపథ్యంలో హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అటు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై గానీ, పటాన్‌చెరు స్థానిక రాజకీయాలపైగానీ హరీశ్‌రావు ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం విశేషం. వరంగల్‌ సభలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మళ్లీ సొంతగూటికి చేరుకుంటారని స్థానికంగా ప్రచారం జోరుగా సాగుతోంది. బహుశా అదే కారణంగానే హరీశ్‌రావు కూడా మహిపాల్‌రెడ్డిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని తెలుస్తోంది.

వెన్నవరం ఆధ్వర్యంలో తొలిసమావేశం

పటాన్‌చెరు నియోజకవర్గ సమన్వయకర్తగా వెన్నవరం ఆదర్శ్‌రెడ్డిని నియమించిన తర్వాత తొలిసారి పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం, హరీశ్‌రావు రాకతో బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపింది. ఈ సమావేశానికి ప్రధాన నాయకులు మెట్టుకుమార్‌ యాదవ్‌, కొలన్‌ బాల్‌రెడ్డి, సోంరెడ్డి, వెంకటేశ్‌(జిన్నారం), శ్రీధర్‌చారి, మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణ, స్థానిక యువనాయకుడు మ్యాథరి పృథ్వీరాజ్‌ హాజరయ్యారు.

కలసి పనిచేద్దాంః ఆదర్శ్‌రెడ్డి

బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో పాటే పార్టీ కేడర్‌ కూడా వెళ్లిపోయిందని జరుగుతున్న ప్రచారాన్ని ఆదర్శ్‌రెడ్డి కొట్టిపారేశారు. అందరం కలసి పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని ఆయన పేర్కొన్నారు. ప్రజల పక్షాన తాము ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ముమ్మరం చేస్తామని తెలిపారు.

కొంతమంది నేతల్లో అసంతృప్తి!

నియోజకవర్గ సమన్వయకర్తగా ఆదర్శ్‌రెడ్డి నియామకం ప్రకటన పట్ల కొంతమంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ కోఆర్డినేటర్‌ నియామక ప్రకటన ప్రక్రియ తమకు ముందుగా తెలియదని ఆదర్శ్‌రెడ్డే స్వయంగా ఫోన్‌ చేసి చెప్పుకున్నారని కొంతమంది బీఆర్‌ఎస్‌ నేతలు పెదవి విరుస్తున్నారు. వాస్తవానికి ఇది రాజకీయ సమావేశమా లేక వ్యక్తిగత సమావేశమా అని కొంతమంది నేతలు బాహాటంగానే విమర్శించడం గమనార్హం. ఆదర్శ్‌రెడ్డి నియామకాన్ని హరీశ్‌రావే స్వయంగా తమతో చెప్పి ఉంటే బాగుండేదని చెబుతున్నారు.

పటాన్‌చెరు సభలో హరీశ్‌రావు

బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement