సిరిసిల్లటౌన్: 80ఏళ్ల గణపయ్య ఉత్సవాలకు సిరిసిల్ల ముస్తామైంది. స్వాతంత్య్రానికి ముందే స్థానిక గాంధీచౌక్లో అప్పటి పుర ప్రముఖులు రుద్ర శంకరయ్య, మడూరి అంబాజి, భీమనాఽథిని నారాయణ, కుడిక్యాల రాజా రాం, ఎలగొండ నారాయణ మొదటి గణపతిని నెలకొల్పారు. ప్రస్తుతం మార్కండేయ భవనంలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో 80వ వార్షికోత్సవం జరుపుతుండగా అధ్యక్షుడిగా దూడం శంకర్ ఉన్నారు. ఆర్యవైశ్యులు ఆధ్వర్యంలో 1948 నుంచి నవరాత్రులకు అంకురార్పణ చేశారు. పెద్దబజారు హన్మాన్ ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఎనభై ఏళ్లక్రితం పట్టణ ప్రముఖులు వినాయక ఉత్సవ సంఘం నెలకొల్పారు. వారి ఆదర్శంలోనే మేము వేడుకలు జరుపుతున్నాం. ప్రతి ఏడాది ఏకదంతుడికి నిత్య కై ంకర్యాలు, అన్నదానాలు ఇదే విధంగా నిర్వహిస్తాం.
– డి.శంకర్, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు


