మాది జగిత్యాల జిల్లా మల్యాల మండలం. పన్నెడేళ్లుగా సిరిసిల్లలోనే ఉంటున్నా. ఇక్కడే ఓటుహక్కు ఉంది. మా ఊరిలో డెవిడ్ అని పిలిచే వారు. ఇక్కడ సత్యనారాయణగా గెజిట్ ద్వారా పేరు మార్చుకున్నా. ఓటర్ల సర్వేలో ఫొ టోలు, ఇతర ఆధారాలు అందించాను. అయినా.. మరోసారి నోటీసు రావడంతో విచారణకు వచ్చాను. – సత్యనారాయణ, సిరిసిల్ల
తలనొప్పిగా మారింది
ఓటర్ల జాబితా సవరణ తలనొప్పిగా మారింది. నాకు 1,140 మంది ఓటర్ల జాబి తా ఇచ్చారు. పల్లెటూరు అయితే వెంటనే గుర్తుపడతాం. పట్టణం కావడంతో ఎవరూ.. ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. అద్దెకు ఉండి వెళ్లిపోతారు. ఓటు ఉంటుంది. కానీ వాళ్ల అడ్రస్ తెలియదు. నా పరిధిలో అడ్రస్ లేని వారు 300 మంది ఉన్నారు. – కాసర్ల తార, బీఎల్వో, సిరిసిల్ల


