● జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్
సిరిసిల్ల: విద్యార్థుల్లో దృష్టిలోపాలను ప్రారంభ దశలోనే గుర్తించాలని జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో బుధవారం రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే)పై సమీక్షించారు. ‘నో స్కూల్ లెఫ్ట్ – నో చైల్డ్ లెఫ్ట్’ అనే లక్ష్యంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఈనెల 15 నుంచి సమగ్ర నేత్రపరీక్షలు చేయాలని సూచించారు. పరీక్షల వివరాలు సక్రమంగా నమోదు చేసి, అవసరమైన వారికి వైద్యసేవలు అందించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్వో నాగేందర్బాబు, ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ అధి కారి, వైద్యులు నయీమ్ జహా, సంపత్కుమార్, డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, డీపీవో ఎన్హెచ్ఎం రాజేందర్ పాల్గొన్నారు.


