శ్రావణమాసం చివరి మంగళవారం సందర్భంగా కార్మికక్షేత్రం సిరిసిల్ల ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. స్థానిక ఆర్యవైశ్య భవనంలో శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీలలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చనలు నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు ఎల్లంకి వాణి, చేపూరి జమున, గౌరిశెట్టి ఇందిరా, అల్లాడి సరస్వతిదేవి, బుస్స ప్రసన్న, రాజూరి చంద్రకళ, ఎల్లంకి లక్ష్మి, గూడెల్లి కవిత, గౌరిశెట్టి బాలలక్ష్మి, పుల్లూరి సమత తదితరులు పాల్గొన్నారు.
– సిరిసిల్లటౌన్


