● అన్నీ వ్యవసాయేతర భూములే.. ● రిజిస్ట్రేషన్లకు బ్రేక్.. సామాన్యులకు షాక్ ● ఫిర్యాదులు చేసినా మోక్షం లేదు
భూములు..
● ‘ఇది వేములవాడ అర్బన్ మండలం తెట్టెకుంట శివారులోని సర్వేనంబరు 6లోని స్థలం. ఈ సర్వే నంబరులో మొత్తం 11 ఎకరాలు ఉండగా, అగ్రహారం ఆంజేయస్వామి ఆలయానికి 2.18 ఎకరాల భూమి ఉంది. ఆలయ భూమి ఉండడంతో ఆ సర్వే నంబరు మొత్తాన్ని 22–ఎ, 22–సీలో చేర్చి ఆలయ భూమిగా పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన అధికారులు.. ఆలయానికి 2.18 ఎకరాల భూమి దేవాదాయ శాఖ ఆధీనంలో ఉందని, మిగతా భూమి పట్టాదారుదేనని నివేదిక ఇచ్చారు. కానీ, ఇప్పటికీ ఆ 6 సర్వే నంబరులోని 8.22 ఎకరాల్లో చిన్న చిన్న ప్లాట్లు రిజిస్ట్రేషన్ కావడం లేదు. ఏనాడో కొనుగోలు చేసి పెట్టుకున్న ప్లాటు రిజిస్ట్రేషన్ కాక సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.’


