బీజేపీ ఆఫీస్‌పై దాడి అప్రజాస్వామికం | - | Sakshi
Sakshi News home page

బీజేపీ ఆఫీస్‌పై దాడి అప్రజాస్వామికం

Sep 4 2026 7:35 AM | Updated on Sep 4 2026 7:35 AM

సిరిసిల్లటౌన్‌: బీజేపీ కార్యాలయంపై దాడి అప్రజాస్వామ్యంమని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో చేపట్టిన ధర్నాలో మాట్లాడారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు చేసిన దాడిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకవపోవడం శోచనీయమన్నారు. నల్గొండ జిల్లాలో బీజేపీ జిల్లా అధ్యక్షుల ఇంటిపై జరిగిన దాడి ఘటనను పరిశీలించేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వెళ్తున్న సమయంలో కూడా దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మను నాయకులు దహనం చేశారు. తొలుత సీఎం చిత్రపటాన్ని దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు, నాయకుల మధ్య తోపులాట జరిగి కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దుమాల శ్రీకాంత్‌, పొన్నాల తిరుపతిరెడ్డి, కర్నె హరీశ్‌, మీసా సంజీవ్‌, ఆసాని రామలింగారెడ్డి, ఉడుగుల యాదగిరి, కిరణ్‌నాయక్‌, డాక్టర్‌ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement