పాఠశాల పనులు త్వరగా పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

పాఠశాల పనులు త్వరగా పూర్తి చేయండి

Aug 30 2026 11:38 PM | Updated on Aug 30 2026 11:38 PM

రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండలం గైదిగుట్ట తండా గ్రామంలో నిర్మిస్తున్న ట్రైబల్‌ వెల్ఫేర్‌ బాలికల పాఠశాల భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం ట్రైబల్‌ వెల్ఫేర్‌ బాలికల పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ట్రైబల్‌ వెల్ఫేర్‌ బాలికల పాఠశాల పనులు పూర్తికాక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకు వస్తే పరిష్కరించి సహకారం అందిస్తానన్నారు. నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement