ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలి సే అవకాశం మండలంలోని దుమాల గురుకులం ఏకలవ్య మోడల్ పాఠశాల విద్యార్థినికి ద క్కింది. వివిధ రాష్ట్రాల నుంచి పలువురు విద్యార్థులు వెళ్లగా.. జిల్లా నుంచి 8వ తరగతి విద్యార్థిని కారుణ్యకు అవకాశం వచ్చింది. ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలి పారు. విద్యార్థులంతా ఉన్నతంగా చదివి భవి ష్యత్లో ఉన్నత స్థానాల్లో రాణించాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. కారుణ్యను స్కూల్ ప్రిన్సిపాల్ తోపాటు ఎంఈవో కృష్ణహరి అభినందించారు.


