● ఆర్డీవో కేఎస్బీ కుమారి
వేములవాడఅర్బన్/కోనరావుపేట: భూభారతి రీసర్వేలో ఏ ఒక్క సర్వేనంబర్నూ వదిలిపెట్టొద్దని వే ములవాడ ఆర్డీవో కేఎస్బీ కుమారి సూచించారు. కోనరావుపేట మండలం మర్తనపేటలో కొనసాగుతున్న భూసర్వేను శనివారం పరిశీలించారు. రైతులకు ఒక్క రోజు ముందే సమాచారం ఇవ్వాలని సూచించారు. తహసీల్దార్ వరలక్ష్మి, ఆర్ఐ సంతో ష్, జీపీవో గంగాధర్, సర్వేయర్ శృతి, ఉపసర్పంచ్ బోనాల పునీత్ పాల్గొన్నారు.
నిర్ణీత గడువులోగా పత్రాలు సమర్పించాలి
సర్ ప్రక్రియలో నోటీసులు జారీ అయిన ఓటర్లు నిర్ణీత గడువులోగా సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని ఆర్డీవో తెలిపారు. తన ఆఫీస్లో అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు.


