● మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా
సిరిసిల్లటౌన్: ప్రజలు ప్రతీ నీటిబొట్టును ఒడిసిపట్టాలని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎం.ఎ.ఖదీర్పాషా కోరారు. ఆదివారం ‘క్యాచ్ ది రైన్’లో భాగంగా పట్టణంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. జల్శక్తి అభియాన్– జేఎస్జేబీ 3.0 కార్యక్రమాన్ని ఈనెల 6 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, నీటి పొదుపు యొక్క ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. టీపీబీవో వేణు, మున్సిపల్ సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.


