నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు పాటించాలి

Jan 5 2026 11:38 AM | Updated on Jan 5 2026 11:38 AM

నిబంధనలు పాటించాలి

నిబంధనలు పాటించాలి

● జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్‌ ● 200 మంది డ్రైవర్లకు కంటి వైద్యపరీక్షలు

● జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్‌ ● 200 మంది డ్రైవర్లకు కంటి వైద్యపరీక్షలు

సిరిసిల్ల: వాహనదారులు రవాణాశాఖ నిబంధనలు పాటించాలని జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్‌ సూచించారు. సిరిసిల్ల ఆర్టీవో ఆఫీస్‌లో ఆదివారం రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా డ్రైవర్లకు ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి వైద్యులతో ఉచిత నేత్రవైద్య పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ ‘సడక్‌ సురక్ష అభియాన్‌’లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీటుబెల్టు ఆవశ్యకత, హెల్మెట్‌ వినియోగం, డ్రంకెన్‌డ్రైవ్‌, ర్యాష్‌డ్రైవింగ్‌, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం ఎంత ప్రమాదమో వివరిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా 200 మంది డ్రైవర్లకు కంటి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఎంవీఐ వంశీధర్‌, ఎల్వీ ప్రసాద్‌ కంటి వైద్యులు, ఏఎంవీఐలు రజనీ, పృథ్వీరాజ్‌వర్మ, ఆర్‌టీఏ సభ్యులు సంగీతం శ్రీనాథ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement