భక్తులకు ఇబ్బంది కలగొద్దు | - | Sakshi
Sakshi News home page

భక్తులకు ఇబ్బంది కలగొద్దు

Dec 27 2025 6:59 AM | Updated on Dec 27 2025 6:59 AM

భక్తులకు ఇబ్బంది కలగొద్దు

భక్తులకు ఇబ్బంది కలగొద్దు

వేములవాడ: రాజన్న, భీమన్న దర్శనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని దుకాణదారులకు సూచించారు. రోడ్డును ఆక్రమించిన దుకాణాలు తొలగింపజేశారు. వరుస సెలవులతో భారీగా తరలివచ్చిన భక్తులతో శుక్రవారం భీమన్న, బద్దిపోచమ్మ ఆలయాల ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఏఎస్పీ అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయించారు. ఆ ప్రాంతంలో రోడ్డుపైకి వచ్చిన దుకాణాలను తొలగింపజేశారు. ఆటోడ్రైవర్లు పోలీసుల సూచనలు పాటించాలని సూచించారు. టౌన్‌ సీఐ వీరప్రసాద్‌ ఉన్నారు.

చందుర్తి(వేములవాడ): శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏఎస్పీ రుత్విక్‌సాయి సూచించారు. చందుర్తి ఠాణాను తనిఖీ చేశారు. పెండింగ్‌ కేసుల వివరాలు తెలుసుకున్నారు. డయ ల్‌ 100కు వచ్చే కాల్స్‌పై స్పందించాలని సూచించారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేశ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement