
భీముని మల్లారెడ్డిపేటలో కలెక్టర్, ఎస్పీ పూజలు
సిరిసిల్ల: గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట శివారులోని శ్రీఆంజనేయస్వామిని కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతే ఆదివారం దర్శించుకున్నారు. స్వామి వారికి పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు శాలువా కప్పి ఆశీర్వచనం చేశారు. ఆలయ చరిత్రను కలెక్టర్, ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధి, సదుపాయాల కల్పన, గ్రామంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్గౌడ్, గంభీరావుపేట ఎస్సై ప్రేమానందం, ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ పాల్గొన్నారు.
● ఆంజనేయస్వామి దర్శనం