న్యూస్రీల్
బూచేపల్లి వైద్య శిబిరానికి విశేష స్పందన
బూచేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చీమకుర్తిలో నిర్వహించిన ఉచిత మెగా కంటివైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 1700 మందికిపైగా హాజరయ్యారు.
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను రెండు నెలల్లోనే మంజూరు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దంకి నియోజకవర్గంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కావాలంటే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సిఫారసు లేఖ తీసుకురావాలని అధికారులు చెబుతుండడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవక బోర్లు వేయాల్సి వచ్చిన రైతులకు కనెక్షన్లు ఇవ్వకుండా నెలల తరబడి తిప్పించడంపై రైతులు, రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.


