● అటవీ శాఖ అధికారులకు అప్పగించిన యువకులు
పొన్నలూరు: మండలంలోని పరుచూరివారిపాలెం సమీపంలో పాలేరు వద్ద అరుదైన నక్షత్ర తాబేలు దర్శ నమిచ్చింది. గ్రామానికి చెందిన యువకులు మన్మధ, శేఖర్ ఆదివారం గ్రామానికి సమీపంలోని పాలేరు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో అరుదైన నక్షత్ర తాబేలు వారి కంటపడింది. తాబేలును పట్టుకుని గ్రామానికి చేరుకోగా పెద్దల సూచన మేరకు అటవీశాఖ అధికారులకు అప్పగించారు. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న అరుదైన నక్షత్ర తాబేలును యువకులు సంరక్షించి తీసుకురావడం అభినందనీయమని అటవీశాఖ అధికారి పేర్కొన్నారు.


