నాటుబాంబు కొరికి కుక్క మృతి | - | Sakshi
Sakshi News home page

నాటుబాంబు కొరికి కుక్క మృతి

Aug 31 2025 7:36 AM | Updated on Aug 31 2025 10:10 AM

-
నాటుబాంబు కొరికి కుక్క మృతి ● గోగులదిన్నెలో నాటుబాంబు కలకలం ఆర్‌ఐఈసీసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లో దోర్నాల విద్యార్థిని ప్రతిభ ● స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించిన అంజన షణ్ముఖ ప్రియ

మార్కాపురం: నాటుబాంబు కొరికి కుక్క మృతిచెందిన ఘటన మార్కాపురం మండలం గోగులదిన్నెలో శనివారం జరిగింది. పోలీసు కథనం మేరకు గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపంలోని ఖాళీ స్థలంలో ఉన్న నాటుబాంబును తినే పదార్థం అనుకుని కుక్క నోటపట్టుకుని వచ్చి రోడ్డుపై కొరికింది. దీంతో పెద్ద శబ్దంతో బాంబు పేలడంతో కుక్క తల ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందింది. భారీ శబ్దం రావడంతో గ్రామస్తులంతా ఉలిక్కిపడి ఘటనా స్థలానికి చేరకున్నారు. సమీపంలో ఇంకా ఏమైనా ఉన్నాయా అని వెతికారు. సమాచారం అందుకున్న మార్కాపురం రూరల్‌ ఎస్సై అంకమరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పందుల కోసం ఎవరైనా నాటుంబాబు పెట్టి ఉండవచ్చని భావిస్తున్నామని ఎస్సై తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement