నా సోదరుడు గురుమూర్తికి అభినందనలు: సీఎం జగన్‌ | YS Jagan Mohan Reddy Congratulates Gurumurthy Over Victory | Sakshi
Sakshi News home page

నా సోదరుడు గురుమూర్తికి అభినందనలు: సీఎం జగన్‌

May 2 2021 8:27 PM | Updated on May 2 2021 9:30 PM

YS Jagan Mohan Reddy Congratulates Gurumurthy Over Victory - Sakshi

సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గురుమూర్తి ఘన విజయం సాధించిన సాంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురు మూర్తికి అభినందనలు తెలిపారు. ఇది ప్రజల విజయం అన్నారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘23 నెలల పాలన తర్వాత తిరుపతి పార్లమెంట్‌కు జరిగిన ఉపఎన్నికలో ప్రజలు మన ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. తిరుపతి పార్లమెంట్ ఓటర్లు 2019 ఎన్నికల్లో 2.28 లక్షల మెజార్టీతో దీవించారు. మనందరి ప్రభుత్వం చేసిన మంచిని మనసారా దీవించి.. నన్ను, మన ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ.. ఈ రోజు 2.71 లక్షల మెజార్టీతో ఆశీర్వదించారు. వారు మనపై చూపించిన అభిమానం, గౌరవం ఎంతో గొప్పది. ఈ విజయం నా బాధ్యతను మరింతగా పెంచుతుంది. దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలతోనే ..ఈ విజయం సాధ్యమైంది అని సీఎం జగన్‌ తెలిపారు.

చదవండి: తిరుపతి ఉప ఎన్నిక: ఓట్ల సునామీ.. సామాన్యుడిదే గెలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement