కేసీఆర్‌ అన్ని వర్గాలను మోసం చేశారు: షర్మిల | Telangana: Ysrtp Chief Ys Sharmila Slams Kcr Bhadradri | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ అన్ని వర్గాలను మోసం చేశారు: షర్మిల

Apr 21 2022 3:48 AM | Updated on Apr 21 2022 5:34 AM

Telangana: Ysrtp Chief Ys Sharmila Slams Kcr Bhadradri - Sakshi

సాక్షి,భద్రాద్రి(పాల్వంచ): ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేశారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సి పాలిటీ పరిధిలోని కరకవాగు గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన రైతుగోస దీక్షలో ఆమె మాట్లాడారు. కేజీ టు పీజీ ఉచిత విద్య పేరిట విద్యార్థులను, పోడు భూములకు పట్టాలిస్తామని ఆదివాసులను, నిరుద్యోగ భృతి అని యువకులను, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పేరిట పేదలను ఇలా సీఎం కేసీఆర్‌ మోసం చేయని వర్గమం టూ లేదని విమర్శించారు.

దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఖమ్మం జిల్లాలో 1.9 లక్షల ఎకరాలకు పట్టాలు ఇస్తే, ఆ తర్వాత ఎవరికీ పట్టాలు ఇచ్చిన దాఖలాలే లేవని తెలి పారు.  కొత్తగూడెం ఎమ్మెల్యే, ఆయన కుమారుడి అరాచకాలకు అంతే లేదని షర్మిల ధ్వజమెత్తారు. ఈ దీక్షలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్‌ గడిపెల్లి కవిత, భద్రాద్రి జిల్లా అధ్య క్షుడు నరాల సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement