ఏ ముఖంతోనో.. వచ్చాక ప్రధాని చెబుతారు | Telangana BJP Chief Bandi Sanjay Comments On PM Narendra Modi | Sakshi
Sakshi News home page

ఏ ముఖంతోనో.. వచ్చాక ప్రధాని చెబుతారు

Jun 24 2022 1:38 AM | Updated on Jun 24 2022 1:38 AM

Telangana BJP Chief Bandi Sanjay Comments On PM Narendra Modi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘మోదీ ముఖం మంచిదే. ఆ ముఖంతోనే వస్తున్నారు. మోదీ తెలంగాణకు ఎందుకు వస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. కేసీఆర్‌కు బాగా తెలుసు. జాతీయ కార్యవర్గ సమావేశాల వేదికగా మోదీయే సమాధానం చెబుతారు’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. తెలంగాణకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారంటూ ప్రధానిపై మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలనుద్దేశించి విలేకరులడిగిన ప్రశ్నకు సంజయ్‌ స్పందించారు.

కబ్జాలు, హత్యలు అత్యాచారాలకు రాష్ట్రాన్ని అడ్డాగా మార్చిన కేసీఆర్, ఏ ముఖం పెట్టుకుని దేశమంతా తిరుగుతున్నారని ఎదురు ప్రశ్నించారు. వరం గల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నాయకురాలు, మాజీ కార్పొరేటర్‌ నాగమళ్ల ఝా న్సీరాణి, ఎన్‌ఆర్‌ఐ నాగమళ్ల సంతోష్‌ ఆధ్వర్యంలో పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు బండి సంజయ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ వాదులారా.. బీజేపీలో చేరండి. అరాచక పాలన కొనసాగిస్తున్న కేసీఆర్‌ మెడలు వంచు దాం. టీఆర్‌ఎస్‌ పాలనను బొంద పెడదాం’’ అని పిలుపునిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement