సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలువురిని పార్టీ రాష్ట్ర కార్యదర్శులు(పార్లమెంటు)గా నియమించారు. డి.శ్రీరామకృష్ణమూర్తి(అమలాపురం), గొల్లపల్లి డేవిడ్ రాజు(కొత్తపేట), ఎస్.సత్యనారాయణమ్మ(కర్నూల్) పార్టీ కార్యదర్శులుగా (పార్లమెంట్) నియమితులయ్యారు.
అలాగే, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా జె.మారయ్య(ఆలూరు), ఆర్.బి.చంద్రశేఖర్ రెడ్డి(పాణ్యం), గంధం వీర రాఘవరెడ్డి(ఆళ్లగడ్డ), నారపురెడ్డి జగదీశ్వర్ రెడ్డి(జమ్మలమడుగు), రాచంరెడ్డి భాస్కర రెడ్డి(పుట్టపర్తి), రాజులపూడి భాస్కరరావు(అమలాపురం)ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది.


