MLA Vallabhaneni Vamsi Slams Nara Lokesh Yuva Galam Pada Yatra - Sakshi
Sakshi News home page

‘లోకేష్‌ కోటలో ఉన్నా పేటలో ఉన్నా ఒక్కటే.. కార్యకర్తలు ఆర్థికంగా చితికిపోయారు’

Apr 4 2023 11:27 AM | Updated on Apr 4 2023 11:53 AM

MLA Vallabhaneni Vamsi Slams Nara Lokesh Yatra - Sakshi

కృష్ణా జిల్లా: లోకేష్‌ చేస్తున్న యాత్ర వల్ల ఒరిగేదేమీ లేదని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తేల్చిచెప్పారు. లోకేష్‌ యాత్ర అనేది ఏదో ఒక రికార్డ్‌ ప్రయోజనం కోసమే తప్పితే, ఆ యాత్ర వల్ల ఒక్క ఓటు కూడా పెరగదన్నారు

వంశీ. మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడిన వంశీ.. లోకేష్‌ అనేవాడు కోటలో ఉన్న పేటలో ఉన్న ఒక్కటే. లోకేష్‌ యాత్ర వల్ల ఒక్క ఓటు కూడా పెరగదు. చంద్రబాబుకు పడని ఓటు లోకేష్‌కు ఎలా పడుతుంది.  జూనియర్‌ ఎన్టీఆర్‌ను బ్లాక్‌ చేయడం కోసమే లోకేష్‌ యాత్ర. లోకేష్‌ యాత్ర కారణంగా కార్యకర్తలంతా ఆర్థికంగా చితికిపోయారు.

వాళ్ల సొమ్మంతా లోకేష్‌ పప్పుకి, టిఫన్లకే సరిపోతుంది. మేమేదో గోడదూకుతామని కొందరు మెరుపు కలలు కంటున్నారు. అవి మెరుపు కలలు మాత్రమే, అటువంటి పరిస్థితి లేదు. నేను ఐఎస్‌బీలో పరీక్ష రాస్తున్నందున ఎమ్మెల్యేల మీటింగ్‌కు వెళ్లలేదు.గోబెల్స్‌ ప్రచారం చేయడంలో చంద్రబాబు నంబర్‌వన్‌. టీడీపీ ఒక ఎమ్మెల్సీ గెలవడం వల్ల వైఎస్సార్‌సీపీకి నష్టం లేదు’ అని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement