
ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలోనే విశాఖలో భూ దందాలు జరిగాయన్నారు.
గీతం కాలేజీ ఆక్రమణలపై పవన్ ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి మండిపడ్డారు. ఎలాంటి అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారని, టీడీపీ అక్రమాలపై గతంలో పవన్ ఎందుకు నిలదీయలేదంటూ అమర్నాథ్ దుయ్యబట్టారు.
‘‘ప్రభుత్వ నిర్మాణాలపై పవన్ అభ్యంతరం ఏంటి?. రాష్ట్ర ప్రభుత్వానికి పేరు రాకూడదనే పవన్ తాపత్రయం. చంద్రబాబు, పవన్కల్యాణే దండుపాళ్యం బ్యాచ్. పవన్ జ్ఞానం వచ్చే పుస్తకాలు చదివుంటే బాగుండేది. తన అన్నయ్య చెప్పినట్టు ఫేస్ లెప్ట్ టర్న్ చేసి ఉంటే గీతం కాలేజీ కనిపించేది. బాబు బంధువు కాబట్టే గీతం వర్శిటీ అక్రమాలు పవన్కు కనపడలేదు’’ అంటూ మంత్రి అమర్నాథ్ నిప్పులు చెరిగారు.
చదవండి: శ్రీగిరి సాక్షిగా 'అతనే' ద్రోహి!