‘చేసిందేమీ లేకపోయినా కొత్త డ్రామా తెరలేపాడు’ | Sakshi
Sakshi News home page

‘చేసిందేమీ లేకపోయినా కొత్త డ్రామా తెరలేపాడు’

Published Sat, Dec 3 2022 5:04 PM

Minister Dadisetti Raja Takes On Chandrababu Naidu - Sakshi

కాకినాడ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. పనిగట్టుకుని పోలవరంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నది చంద్రబాబేనని విమర్శించారు దాడిశెట్టి రాజా.

పోలవరం మీద చంద్రబాబు కొత​ డ్రామాకు తెరతీశారని, ఆయన హయాంలో పేదలకు చేసేందేమీ లేదనే విషయం గుర్తించుకుంటే మంచిదన్నారు. మేనిఫెస్టోను దాచేసి, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది చంద్రబాబేనన్నారు. చంద్రబాబు మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు.

Advertisement
Advertisement