కాక రేపుతున్న యూపీ ఎన్నికలు.. బీజేపీ ఎమ్మెల్యేకు అఖిలేష్‌ బంపర్‌ ఆఫర్‌ | UP Elections 2022: Akhilesh Yadav Offers Ticket To BJP Gorakhpur MLA | Sakshi
Sakshi News home page

Akhilesh Yadav: కాక రేపుతున్న యూపీ ఎన్నికలు.. బీజేపీ ఎమ్మెల్యేకు అఖిలేష్‌ బంపర్‌ ఆఫర్‌

Jan 18 2022 3:20 PM | Updated on Jan 18 2022 4:19 PM

UP Elections 2022: Akhilesh Yadav Offers Ticket To BJP Gorakhpur MLA - Sakshi

గోరఖ్‌పూర్ సిట్టింగ్‌ ఎమ్మెల్యే  రాధా మోహన్‌దాస్ అగర్వాల్‌కు ఎస్పీ చీఫ్‌ అఖిలేష్ యాదవ్‌ బంపర్ ఆఫర్ ఇచ్చారు. 

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వర్సెస్ సమాజ్‌వాదీపార్టీ అన్నట్టుగా నడుస్తోంది ఎన్నికల రాజకీయం. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గోరఖ్‌పూర్ అర్బన్‌ నియోజకవర్గం స్థానం నుంచి పోటీ చేస్తుండటంతో ఆ స్థానం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదేక్రమంలో గోరఖ్‌పూర్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా  రాధా మోహన్‌దాస్ అగర్వాల్‌కు బీజేపీ హైకమాండ్‌ ఏ సీటు కేటాయిస్తుందో ఇంకా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో గోరఖ్‌పూర్ సిట్టింగ్‌ ఎమ్మెల్యే  రాధా మోహన్‌దాస్ అగర్వాల్‌కు ఎస్పీ చీఫ్‌ అఖిలేష్ యాదవ్‌ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

సమాజ్‌వాదీ పార్టీలో చేరి సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై పోటీచేయాలని ప్రతిపాదించారు. ఆయన రావడానికి ఆసక్తిగా ఉంటే,.. గోరఖ్‌పూర్ అర్బన్‌ సీటును కేటాయించడానికి సిద్ధమని అన్నారు. 2002 నుంచి రాధా మోహన్‌దాస్‌ గోరఖ్‌పూర్ అర్బన్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవలే ముగ్గురు మంత్రులు, ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో ఫిబ్రవరి 10న మొదలయ్యే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మార్చి 10 వరకు కొనసాగనుంది. మొత్తం 7 దశల్లో ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్‌ ప్రకటించింది.
(చదవండి: పంజాబ్‌ ఆప్‌ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement