Telangana: నేడు కాంగ్రెస్‌ ‘సత్యాగ్రహ దీక్షలు’ | Congress Demanding To Add Corona Treatment In Aarogyasri In Telangana | Sakshi
Sakshi News home page

Telangana: నేడు కాంగ్రెస్‌ ‘సత్యాగ్రహ దీక్షలు’

Jun 7 2021 3:06 AM | Updated on Jun 7 2021 3:06 AM

Congress Demanding To Add Corona Treatment In Aarogyasri In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కరోనా బాధితుల పక్షాన కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యక్ష పోరాటానికి దిగుతోంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, బ్లాక్‌ఫంగస్‌ బాధితులకు ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సోమవారం ‘సత్యాగ్రహ దీక్షలు’చేపట్ట నుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ దీక్షలను కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నట్టు గాంధీభవన్‌ వర్గాలు వెల్లడిం చాయి.

అన్ని జిల్లా కేంద్రాలతో పాటు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్‌లో కూడా ఈ దీక్షలు చేపట్టనున్నారు. ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలతో పాటు పలువురు నేతలు రాష్ట్రవ్యాప్తంగా పాల్గొననున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement