బీజేపీకి ఒక్క చాన్స్‌ ఇవ్వండి | BJP Foundation Day celebrated at partys state office | Sakshi
Sakshi News home page

బీజేపీకి ఒక్క చాన్స్‌ ఇవ్వండి

Apr 7 2025 4:26 AM | Updated on Apr 7 2025 4:26 AM

BJP Foundation Day celebrated at partys state office

ఇప్పటివరకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పాలన చూశారు  

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,  కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి  

పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీకి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కోరారు. ఇప్పటివరకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఒక్కసారి బీజేపీకి కూడా అవకాశం ఇస్తే పారదర్శక పాలన ఎలా ఉంటుందో చూపిస్తామని అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్స వాన్ని పురస్కరించుకుని ఆదివారం బీజేపీ రాష్ట్ర కా ర్యాలయంలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించా రు. 

బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయటం.. భారతదేశ గౌరవాన్ని పెంచటం, అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలబెట్టడమే బీజేపీ లక్ష్య మని పేర్కొన్నారు. రైల్వేస్టేషన్‌లో చాయ్‌ అమ్ముకున్న సాధారణ వ్యక్తి కుమారుడిని ఈ దేశానికి ప్రధానిని చేసిన ఘనత బీజేపీకే దక్కిందని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో మూడు దఫాలుగా అత్యంత సమర్థవంతమైన, పారదర్శక పాలనను బీజేపీ అందిస్తోందని తెలిపారు.  

బీజేపీవైపు చూస్తున్న తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయని కిషన్‌రెడ్డి విమర్శించారు. అందుకే ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో 77 లక్షల మంది తెలంగాణ ప్రజలు బీజేపీకి అండగా నిలిచారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లో విజయం అందించారని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు  చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  

మజ్లిస్‌ ఆగడాలను అరికడతాం 
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఎంఐఎంను పెంచి పోషిస్తున్నాయని కిషన్‌రెడ్డి విమర్శించారు. జీహెచ్‌ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీని గెలిపించేందుకు ఆ రెండు పార్టీలు పోటీపడుతున్నాయ ని ఆరోపించారు. మర్రి చెన్నారెడ్డిని సీఎం పదవి నుంచి దించేందుకు మజ్లిస్‌ హైదరాబాద్‌లో కల్లోలం సృష్టించిందని, తీగలగుట్ట వద్ద 400 మంది దళితులు, హిందువులపై హత్యాకాండకు ఒడిగట్టిందని ఆరోపించారు. మజ్లిస్‌ దౌర్జన్యాల వల్ల పాతబస్తీ నుంచి హిందువులు వలస పోతున్నారని అన్నారు. 

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మజ్లిస్‌ పార్టీ ఆగడాలను అడ్డుకుంటుందని ప్రకటించారు. 14వ తేదీ వరకు బీజేపీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలని, పార్టీ కార్యకర్తలు తమ ఇళ్లపై పార్టీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. 14 నుంచి 22 వరకు అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలను ఘ నంగా నిర్వహించాలని సూచించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే.లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.  

రేవంత్‌రెడ్డి రబ్బర్‌ స్టాంప్‌ ముఖ్యమంత్రి
కాంగ్రెస్‌ సర్కార్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మండిపాటు  
కరీంనగర్‌ టౌన్‌: సీఎం రేవంత్‌రెడ్డి రబ్బర్‌ స్టాంప్‌లా మారారని కేంద్ర హోంశాఖ స హాయ మంత్రి బండి సంజయ్‌ ఎద్దేవా చే శారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం బండి సంజయ్‌ మొదట కరీంనగర్‌లోని తన నివాసంలో.. తరువాత పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తలతో కలసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సచివాలయంలో రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ మంత్రుల కమిటీతో సమీక్ష చేయడమేంటని ప్రశ్నించారు. 

మంత్రివర్గ విస్తరణ విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానానిదే తుది నిర్ణయమని పీసీసీ అధ్యక్షుడు చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరుండాలి? ఎవరు వద్దు అనేదానిపై ముఖ్యమంత్రికి విచక్షణాధికారం ఉంటుందని, తెలంగాణలో పాలన భ్ర ష్టు పట్టిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని మండిపడ్డారు. కాగా, 45 ఏళ్లుగా బీజేపీ అనేక ఒడిదొ డుకులు, అవమానాలను అధిగమించిందన్నారు. 

16 రాష్ట్రాల్లో సొంతంగా.. 6 రాష్ట్రాల్లో కూటమి ద్వారా ప్రభుత్వాలను కొనసాగిస్తోందన్నారు. సన్న బియ్యం కోసం కేంద్రం కిలోకు రూ.37 ఖర్చు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం భరించేది కేవలం రూ.10 మాత్రమే అన్నారు. అలాంటప్పుడు రేషన్‌ షాపుల వద్ద ప్రధాని ఫొటో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు నుంచి బియ్యం వరకు ప్రతిపైసా కేంద్రమే చెల్లిస్తోందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement