Huzurabad Bypoll Results: BJP Chief Bandi Sanjay Comments On Huzurabad Bypoll - Sakshi
Sakshi News home page

ఈటల విజయం ఖాయం.. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం

Nov 2 2021 12:02 PM | Updated on Nov 2 2021 1:03 PM

BJP Chief Bandi Sanjay Comments On Huzurabad Bypoll - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగరబోతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ విజయం సాధించడం ఖాయమని, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని అన్నారు. ఈటల రాజేందర్ బీజేపీ నాయకుడని, ఈటల గెలుపు బీజేపీ గెలుపని, బీజేపీ గెలుపు ఈటల గెలుపేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పై ప్రజలకు విశ్వాసం లేదని, దళిత బంధు అమలు చేసినా ప్రజలు నమ్మడం లేదని విమర్శించారు. కాగా, ఇప్పటిదాకా వెలువడిన హుజూరాబాద్‌ ఫలితాల్లో బీజేపీ తన ఆధిక్యతను కొనసాగిస్తోంది.

చదవండి: (రఘువీరా రెడ్డిని స్తంభానికి కట్టిపడేసింది...ఎవరు?ఎందుకు?) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement