హియరింగ్‌కు డుమ్మా ‘సర్‌’ | - | Sakshi
Sakshi News home page

హియరింగ్‌కు డుమ్మా ‘సర్‌’

Sep 16 2026 4:13 AM | Updated on Sep 16 2026 4:13 AM

సాక్షి,పెద్దపల్లి:

మ్మడి జిల్లాలో సర్‌ నోటీసులు జారీ అవు తున్నా విచారణ ఆశించిన స్థాయిలో ముందుకు సా గడం లేదు. నోటీసులు అందుకున్నవారు నిర్ణీత తే దీల్లో హియరింగ్‌కు హాజరు కావడంలేదు. కేటాయించిన తేదీలు గడిచిపోవడం.. రీషెడ్యూల్‌ చే యాల్సి రావడం వంటి పరిణామాలతో పెండింగ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం వరకు కరీంనగర్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లా ల్లో కలిపి 6,94,517 సర్‌ నోటీసులు జనరేట్‌ కా గా.. 6,12,976 డెలివరీ చేశారు. 81,541 నోటీసు లు డెలివరీ కాలేదు. మరోవైపు హియరింగ్‌ తేదీల్లో గైర్హాజరు కావడంతో 3.21 లక్షలకుపైగా నోటీసులు ల్యాప్స్‌ అయ్యాయి. నిర్దే శిత గడువులోగా ఎంతదరు విచారణకు హాజరవుతారు? ఎంతమంది గైర్హాజరవుతారనేది కీలకంగా మారింది.

నోటీసులు అందినా.. హాజరు ఎక్కడ?

నోటీసు డెలివరీ పూర్తయ్యాక సదరు వ్యక్తికి హియరింగ్‌ తేదీ కేటాయిస్తారు. ఆ తేదీన హాజరు కాకపో తే అది ల్యాప్స్‌ అవుతుంది. అదేఅంశంపై మరోసా రి తేదీ కేటాయించాల్సి వస్తోంది. ఇప్పటికే పెద్దసంఖ్యలో నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఇలాంటి గైర్హాజరీలు పెరిగితే హియరింగ్‌ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు చె బుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా కరీంనగర్‌, జగిత్యాలలో విచారణకు గైరాజరవుతున్నారు.

కారణాలు అనేకం

హియరింగ్‌ తేదీలు ల్యాప్స్‌ కావడానికి ప్రధానంగా నోటీసుల డెలివరీలో జాప్యం ఒక కారణంగా కనిపిస్తోంది. నోటీసు అందిన తర్వాతే సంబంధిత వ్యక్తి విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. భారీ సంఖ్యలో నోటీసులు ఉండటంతో ప్రతీదానిని నిర్ణీ త సమయంలో డెలివరీ చేయకపోవడం, నోటీసు అందుకునే సమయానికి విచారణ తేదీ ముగిసిపోవడం, లేదా తక్కువ సమయం ఉండటం ప్రధాన కా రణంగా తెలుస్తోంది. అలాగే నోటీసులు అందుకు న్న వారు స్థానికంగా కాకుండా హైదరాబాద్‌ తది తర దూరప్రాంతాల్లో ఉండటం కూడా హియరింగ్‌కు హాజరుకావడం లేదంటున్నారు. ఒకవేళ గడు వురోజు హాజరైనా పరిమిత సంఖ్యలో సిబ్బంది ఉండటం, వచ్చిన వారు అధిక సంఖ్యలో ఉండంతో చాలామంది విచారణకు హాజరుకాకుండానే వెనుది రిగిపోతున్నారని అధికారులు అంటున్నారు.

విచారణకు హాజరు పెంచడమే కీలకం

నోటీసులు జారీచేయడంపైనే అధికార యంత్రాంగం దృష్టి సారిస్తోంది. నోటీసు అందుకున్న వారు నిర్ణీత తేదీన విచారణకు హాజరై తమ వాదనలు, ఆధారాలు సమర్పించినప్పుడే ప్రక్రియ ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో హియరింగ్‌ తేదీ, సమయం, వేదికపై స్పష్టమైన సమాచారం అందించడం, గైర్హాజరైన వారికి వెంటనే తదుపరి తేదీ కేటాయించడం, పెండింగ్‌ కేసులపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని అంటున్నారు. లేకపోతే ఒకే కేసుకు పదేపదే తేదీలు కేటాయించే పరిస్థితి ఏర్పడి.. ఇప్పటికే ఉన్న పెండింగ్‌ తేదీలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

నోటీసులు అందినా స్పందించని ఓటర్లు

విచారణకు హాజరు కాని వైనం!

ఉమ్మడి జిల్లాలో 6.94 లక్షల నోటీసులు

డెలివరీ కాని నోటీసులు 81,541

ల్యాప్స్‌ అయిన హియరింగ్‌లు 3.21 లక్షలు

ఉమ్మడి జిల్లా నోటీసుల సమాచారం

జిల్లా జారీ డెలివరీ పెండింగ్‌ విచారణ పూర్తి ల్యాప్స్‌

కరీంనగర్‌ 2,70,190 2,29,052 41,138 82,773 1,24,386

పెద్దపల్లి 1,47,518 1,30,616 16,902 23,107 55,837

సిరిసిల్ల 83,846 76,211 7,635 27,297 38,619

జగిత్యాల 1,92,963 1,77,097 15,866 47,652 1,02,203

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement