ఫెర్టిలైజర్సిటీ: ఖాజీపల్లిలో బుధవారం పోచమ్మ, బొడ్రాయి, భూలక్ష్మీ, మాహాలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ఎన్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భక్తులు అమ్మవార్లకు బోనంతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మేకల పెద్ద కొమరయ్య, ఎంకే యాదవ్, మేకల కుమారస్వామి, మేకల శ్రీనివాస్ యాదవ్, కావటి మల్లేశ్ యాదవ్, బైరం కుమార్బాబు, బైరం కుమార్, మేకల సతీశ్ యాదవ్, సలేంద్ర శ్రీనివాస్, సిలివేరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


