న్యూస్రీల్
అప్పుడే ఎండుతున్న ఆశలు
సుల్తానాబాద్ పట్టణ పరిధి గొల్లపల్లి పరిసర ప్రాంతాల్లో నీరందక వరిపొలాలు నెర్రెలుబారుతున్నాయి. బావుల్లో నీటిమట్టం తగ్గి నీరు అందించే పరిస్థితి లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కీలక దశలో ఉన్న సమయంలో నీరు అందకుంటే దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి డీ–86 కెనాల్ ద్వారా నీరు అందించి పంటలను కాపాడాలని కోరుతున్నారు. – పెద్దపల్లి


