గోదావరిఖని మేదరిబస్తీ ప్రధాన కూడలిలో రోడ్డు కుంగి.. మ్యాన్హోల్ మూత పగిలి ప్రమాదకరంగా మారింది. మ్యాన్హోల్కు మరమ్మతు చేయకుండా, రెండు ట్రాఫిక్ కోన్లు పెట్టి అధికారులు చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తోంది. వాహనాలు రద్దీగా తిరిగే ప్రాంతంలో మ్యాన్హోల్ నుంచి మురుగునీరు రోడ్డుపై పారుతుండగా పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. అయినా బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రమాదం జరిగాక మేల్కొనే బదులు.. ముందే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. – కోల్సిటీ


