కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ఎట్టకేలకు బుధవారం సీటీస్కాన్ సేవలు ప్రారంభమయ్యాయి. ‘నిలిచిన సీటీ స్కాన్ సేవలు’ శీర్షికన ‘సాక్షి’ బుధవారం కథనం ప్రచురించడంతో స్పందించిన వైద్యాధికారులు.. మరమ్మతులు చేసి సీటీస్కాన్ను వినియోలోకి తీసుకొచ్చారు. మరోవైపు.. సిటీస్కాన్ సేవలు నిలిచిపోవడం, పేషెంట్లను ఓ ప్రైవేట్ సీటీస్కాన్ సెంటర్కు వైద్య సిబ్బంది రెఫర్ చేయడంపై అధికారులు విచారణ చేపట్టారు.
ఓసీపీ–3 తనిఖీ
గోదావరిఖని: సింగరేణి ఆర్జీ–2లోని ఓసీపీ–3ని కో ల్కంట్రోలర్ ఆర్గనైజేషన్ బృందం బుధవారం సందర్శించింది. ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు తొలిదశ మూసివే త కోసం తీసుకున్న చర్యలు, వ్యయం, ఇస్క్రో అ కౌంట్స్ క్లయిమ్ చేసుకోవడం తదితర వివరాలపై ఓఎస్డీ కృష్ణమోహన్రావు బృందం ఆరా తీసింది. జీఎం వెంకటయ్య, ఎస్వోటూ జీఎం రాముడు, ఏ రియా సేప్టీ ఆఫీసర్ సంతోష్కుమార్ స్వాగతం పలికారు. ప్రాజెక్టు అధికారి ఉదయ్హరిజన్, మేనేజర్ భరత్కుమార్, సేఫ్టీ ఆఫీసర్ లక్ష్మణ్రావు, అడిషనల్ మేనేజర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


