న్యూస్రీల్
గురువారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2026
ప్రశాంతంగా..
● నిమిషం ‘టెన్’షన్ అక్కర్లేదు ● ఐదు నిమిషాల వరకు అనుమతి
● మొబైల్ఫోన్లకు అనుమతి లేదు ● వందశాతం ఉత్తీర్ణత లక్ష్యం
● ‘సాక్షి’తో జిల్లా విద్యాశాఖాధికారి శారద
సాక్షి పెద్దపల్లి: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు డీఈవో శారద తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని, ఎక్కడా లోటుపాట్లు తలెత్తకుండా, మాస్ కాపీయింగ్కు ఆస్కారం లేకుండా కటుట్టదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లను అనుమతించడంలేదని, పరీక్ష కేంద్రానికి సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించామని వివరించారు. శనివారం నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో డీఈవో పలు విషయాలు వెల్లడంచారు. ఆమె మాటల్లోనే..
హాల్టిక్కెట్ మర్చిపోయినా,
లేదా తీసుకోకుండా వచ్చేవారిని అనుమతిస్తారా?


