అమ్ముకునేందుకు అవస్థలు
పండించిన పత్తి పంటను అమ్ముకునేందుకు అవస్థ పడాల్సి వస్తోంది. యాప్లో నమోదు చేసే సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో జాప్యం అవుతోంది. పత్తికి మార్కెట్లో మద్దతు ధర ఉన్నా యాప్ నమోదుతోనే కొంతఇబ్బంది కలుగుతోంది.
– శ్రీనివాస్, మంగపేట, కాల్వశ్రీరాంపూర్)
12 క్వింటాళ్లకు అనుమతించాలి
పత్తి సాగు చేసిన రైతులకు ఎకరాకి 12 క్వింటాళ్ల వరకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం, కలెక్టర్ చెప్పినా అధికారులు స్పందించడం లేదు. రైతులను ఇబ్బందిపెట్టకుండా దరఖాస్తులను పరిశీలించి సత్వరమే అనుమతించేలా చొరవచూపాలి. – జడల సురేందర్,
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్
సత్వరమే పరిష్కారం
పత్తి దిగుబడులను కపాస్ యాప్లో నమోదు చేసేందుకు 7 క్వింటాళ్లకే తొలుత అనుమతి ఇచ్చారు. కొందరు రైతులు ఎక్కువ దిగుబడి సాధించామని దరఖాస్తు చేస్తే పరిశీలించాకే అనుమతి ఇస్తున్నాం. నల్లరేగడి భూముల్లో నీటివసతి ఉన్న రైతులకే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాం. – శ్రీనివాస్, డీఏవో
అమ్ముకునేందుకు అవస్థలు
అమ్ముకునేందుకు అవస్థలు


