గణితంలో శ్రీనివాసరావుకు పీహెచ్డీ
రాజాం సిటీ: స్థానిక జీసీఎస్ఆర్ కళాశాలలో గణిత అధ్యాపకుడిగా పనిచేస్తున్న శ్రీనివాసరావుకు గణితంలో పీహెచ్డీ పట్టా లభించింది. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇన్విస్టిగేషన్ ఆన్ డెస్క్ ఎనర్జీ కాస్మోలాజికల్ మోడల్ ఇన్ సెర్టిన్ థీరీస్ ఆఫ్ గ్రావిటేషన్ అనే పరిశోధనకు గాను గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ యూనివర్సిటీ పీహెచ్డీ పట్టా ప్రదానం చేసిందని పేర్కొన్నారు. తన ఈ పరిశోధనకు డాక్టర్ వి.గణేష్, డాక్టర్ కె.దాసునాయుడులు గైడ్స్గా వ్యవహరించారన్నారు. శ్రీనివాసరావుకు పీహెచ్సీడీ రావడం పట్ల ప్రిన్సిపాల్ పురుషోత్తం, అధ్యాపకులు అభినందించారు.


